Showing posts with label Civics. Show all posts
Showing posts with label Civics. Show all posts

Saturday, January 25, 2020

భారత రాజ్యాంగం అమలు


*భారత రాజ్యాంగం*
*26 , నవంబర్*
*Constitution Day*

■ భారత రాజ్యంగo అమలు●

1858 నుంచి 1947 వరకూ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని  పరిపాలించారు,  తరువాత 1947 August 15 న మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు  వదిలి వెళ్ళడo జరిగింది. 
తరువాత మన దేశానికి రాజ్యాంగo  కావాలి  ఎవరు రాయగలరు అని ఒక చిన్న సందేశం వఛింది. మన మొదటి ప్రదాని మంత్రి అయిన నెహ్రూ గారు మన దేశం నుంచి కొంతమందిని అమెరికా లో ఉన్న కొలoబియా  యూనివర్సిటీకి పoపారు, వాళ్ళు  మన వాళ్ళకి మీ దేశం లోనే ఒక ప్రపంచ  మేధావి అయిన Dr B.R అంబేద్కర్ గారిని  పెట్టుకుని ఇక్కడి  వరకూ ఎందుకు వచ్చారు  అని చెప్పి  తిరిగి మన దేశానికి పoపారు. తరువాత  రాజ్యాంగ ముసాయిదా కమిటీ వేసి ఆ కమిటీకి Dr B.R అంబేద్కర్ గారిని  చైర్మన్ గా నియమించారు...

 👉🏼 ఈ విషయాల నుంచి ప్రతీమనిషీ ప్రత్యేకించి దళిత జాతులు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి.

అప్పటికి ఉన్నతవర్గాల ప్రజలూ, మరికొంతమంది మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండి, మిగతా పౌరులకు ఏమాత్రం ప్రాతినిధ్యం లేని పరిస్థితి భారతదేశంలో నెలకొనిఉంది. *ఆర్ధిక అసమానతలెన్ని ఉన్నా, రాజకీయంగా ప్రతీ పౌరునికీ ఒకే విలువ ఉండాలనీ, లేని పక్షంలో  అసమానతల వల్ల లబ్ధిపొందుతున్న శక్తులు వ్యవస్థను నాశనం చేస్తాయనీ గ్రహించిన బాబాసాహెబ్, తాను రాజ్యాంగ రచనా కమిటీలో ఉండాలనీ, అసమానతలకు తావులేని రాజ్యాంగాన్ని సిద్ధం చేయాలనీ తపనపడడం వల్లే అంతగా శ్రమించి స్థానం సంపాదించుకున్నారు.*

ఐతే, *రాజ్యాంగం ఎంత గొప్పగా రాయబడినా.. రాజ్యాంగం ఎలాంటి శక్తుల చేతిలో ఉంది అన్న విషయం మీద రాజ్యాంగం మంచిదిగా గానీ, చెడ్డదిగా గానీ పరిణమిస్తుంది కనుక, రాజ్యాంగం తన విధిని చక్కగా నిర్వర్తించాలంటే అది ఈ దేశ పౌరులమీదా, వారు ఎన్నుకునే రాజకీయ ప్రతినిధుల చేతుల్లోనూ ఉంటుందని* తేట తెల్లం చేసారు అంబేద్కర్.

 *“తాను రాసిన రాజ్యాంగం అణిచివేయబడ్డ జాతుల హక్కులను నిలబెట్టలేక విఫలమైన పక్షంలో, దాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని కూడా తానే ఔతాన”ని 1949 నవంబరు 25 న, రాజ్యాంగ పరిషత్ నుద్దేశించి తానుచేసిన చివరి ప్రసంగంలో నిష్కర్షగా ప్రకటించారు.*

 దాన్నిబట్టి ,ఈనాడు మనం అనుభవిస్తున్న వివక్షకు కారణం మనం ఎన్నుకున్న తప్పుడు నాయకులే అన్నది ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన ముఖ్య విషయం.

ఈ మాటలనుంచి, తాననుకున్నది ఎంత కష్టమైనదైనా సాధించడంలో అంబేద్కర్ చూపించిన బాధ్యత నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి అనే విషయం ఇప్పుడు మనమందరం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న.
తనజాతి ప్రశాంతంగా హక్కులతో అందరితో సమానంగా బ్రతకాలని ఇంత శ్రమించిన బాబాసాహెబ్ కు మనం సరైన గౌరవం ఎప్పుడైనా ఇచ్చామా?

రిజర్వేషన్ల సృష్టికర్తను అన్నం పెట్టినవాడిగా మాత్రమే జమకట్టి, పే బ్యాక్ టు ద సొసైటీని తుంగలో తొక్కిన దొంగలం మనం కామా?

రిజర్వేషన్ వల్ల జీతాలు సంపాదించుకుంటూ, తమ కుటుంబాలకు మాత్రం అంబేద్కర్ చేసిన త్యాగాలను ఏమాత్రం తెలియజేయకుండా వెన్నుపోటు పొడిచిన వారమేకదా మనమంతా?

తాముకూడా మనువాదుల గుంపులో చేరి, తన పక్కింటివాడు బాగుపడితే తనతో సమానమైపోతాడని, దుర్బుద్ధితో ఆలోచించిన వాళ్ళ వల్లే కదా.. ఈరోజు అంబేద్కర్ అంటే ఒక కులనాయకుడిగా మిగిలి, చాందసుల చేతిలో వివాదాస్పద వ్యక్తిగా ముద్రవేయబడ్డాడు?

ఈ క్లర్కుల గుంపు నావల్ల లభ్దిపొంది నన్ను మోసం చేసింది అని బాబాసాహెబ్ కళ్ళ నీళ్ళపర్యంతమైంది ఎవరుచేసిన ద్రోహం వల్ల?

బాబాసాహెబ్ ను కులనాయకుడిగా చేసి ఆ మహా మేధావిని స్థానిక నేతకు కుదించే ద్రోహాలు ఇక మానేద్దాం.

ఆయన ఆశయ సాధన అంటే చుట్టూ ఉన్న బడుగుజాతుల బిడ్డలకు విద్యతో పాటూ, కనీస ప్రాధమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా, అవి కల్పించేలా ప్రభుత్వాలను ఒత్తిడి చేయడం.

 బడుగులందరినీ జ్ఞానవంతులను చేయడం, హెచ్చుతగ్గులు లేని వ్యవస్థ అందరి హక్కు అనే భావజాలాన్ని వీలైనంతగా సమాజానికి చేరవేసి, ఈ దేశపు ప్రతీ పౌరుడికీ ఒకటే విలువ కలిగి ఉండేలా ఇప్పటి యువ సమాజాన్నైనా తీర్చిదిద్దాల్సిన బాధ్యత.. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అర్ధంచేసుకున్న, అభిమానిస్తున్న ప్రతీ వ్యక్తిమీదా ఉంది. అలా చేయగలిగినప్పుడే ఆయన విగ్రహానికి దండ వేసి గౌరవించే స్థాయిని మనం సంపాదించుకున్న వారమౌతాం.

కానీ భారతజాతికి దిశను చూపించే రాజ్యాంగ రచనకు అంబేద్కర్ మాత్రమే సరైనవ్యక్తి అని నాటి సభ్యులు  చెప్పడము జరిగింది, తర్వాత రాజ్యాంగ రచన మొదలుపెట్టారు...

అంబేద్కర్ గారు మన బారత *రాజ్యాంగoను రాయడనికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది.*

అమెరికా రాజ్యాంగo లో కెవలం 7 ఆర్టికల్స్ ఉన్నయ్.  మొత్తం మన బారత  రాజ్యాంగo లో 395 ఆర్టికల్స్ 12 షెడ్యూల్లు ఉన్నాయి.

 ప్రపoచoలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగo మనది.

*భారత దేశ రాజ్యాంగం మన దేశానికి పవిత్ర గ్రంథం. దేశభక్తి గురించి, నినాదాల గురించి, స్వేచ్ఛ గురించి ఎన్నిరకాల అభిప్రాయాలున్నా… అన్నిoటికీ రాజ్యాంగమే ఆదర్శం.... భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది కాబట్టే రాజ్యాంగం అంటే అందరికీ అంత గౌరవం....అలాంటి రాజ్యాంగానికి కర్తకర్మ అన్నీ అంబేద్కరే....*


త్ర భారతదేశం భవిష్యత్ కు దిక్సూచిగా తన ఆత్మనే రాజ్యాంగ గ్రంథంగా రాసుకున్నారు అంబేద్కర్..

*భారతజాతికి ఆయన ఇచ్చిన ఈ బహుమతి మతాలు, కులాలు, వర్గాలన్నిటినీ ఏకంగా చేసింది. ఏతేడా లేకుండా ప్రతి పౌరుడికీ సమానమైన గుర్తింపు ఇచ్చింది. అందుకే అంబేద్కర్ అందరివాడయ్యారు...*

★అంబేద్కర్ ఆలోచనలే భారతీయులందరి ఆత్మగౌరవం..★
 అందుకే తరాలుగా అట్టడుగున ఉండిపోయిన ప్రజలకు ఆయన దేవుడు. *ఆయన ఆలోచనలను కాదనేవాళ్లకు కూడా ఆయనే ఆదర్శం.* అందరికీ కలిసి ఆయన శాశ్వత అవసరం. ఆ అవసరం అనివార్యంగా మారడానికి కారణం… మన రాజ్యాంగం.
ఏ భేదం లేకుండా… *"భారత ప్రజలమైన మేము…"* అంటూ మొదలవుతుంది మన రాజ్యాంగం.
ఈ ఒక్కమాటతో భారత నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పారు అంబేద్కర్.

 అప్పటికే కులాలుగా, మతాలుగా విడిపోయిన భారతీయులను ఒకే ఒక్క మాటతో ఒక్కటి చేశారు.

ఈ సమానత్వంతోనే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు...

మనదేశం కంటే ముందే చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నాయి.... అలా 130కి పైగా దేశాల రాజ్యాంగాలను చదివారు అంబేద్కర్. అవన్నీ అధ్యయనం చేసి మనకు అవసరం అనుకున్నవి, మన దేశ పరిస్థితులకు తగినట్టుగా మార్పులు చేశారు....

మనదేశంలోని రకరకాల సమాజాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో చాలా ముందుగానే అంచనా వేసి, వాటికి పరిష్కారాలు చూపించేలా రాజ్యాంగ రచన చేశారు అంబేద్కర్....

*దేశంలో పటిష్ఠమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు అంబేద్కర్. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. పాలకులు దారితప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కు ఇచ్చారు. హక్కులతో పాటు ప్రభుత్వాలను గైడ్ చేసేలా ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. మనకంటే చాలా ముందుగా రాజ్యాంగం రాసుకున్న అమెరికా వ్యవస్థ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయింది.... కొన్ని పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించింది. కానీ మన రాజ్యాంగం భవిష్యత్ ను చాలా ముందుగా ఊహించి పరిష్కారాలు చూపేలా రచించారు అంబేద్కర్...*

కొన్ని దేశాల్లో పన్ను కట్టేవాళ్లే ఓటర్లు. కొన్ని దేశాల్లో ఇంకొన్ని అర్హతలున్నవాళ్లకే ఓటు. వాటన్నిటికీ భిన్నంగా… దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్.
టాటా, బిర్లా అయినా… రోజు కూలీ అయినా ఓటుకు ఒకటే విలువ. ఇదే అంబేద్కర్ ప్రతిపాదించిన అసలైన ప్రజాస్వామిక సిద్ధాంతం....

అంబేద్కర్ న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు.... మనదేశంలో సామాజిక వివక్ష ఎలా ఉంటుందో, ఎదగడానికి ఎన్ని కష్టాలుంటాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే పౌరహక్కుల విలువను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా… వాటిని రాజ్యాంగంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిని ఎవరూ కాదనే అవకాశం లేకుండా తిరుగులేని రక్షణ కల్పించారు. ప్రజల చుట్టూనే వ్యవస్థ పనిచేసేలా చేశారు.

*ప్రతి పౌరుడూ తన ఆలోచనలు చెప్పుకోగలిగేలా భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు.*  అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు అంబేద్కర్....

*దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబా సాహెబ్. అర్టికల్స్ 14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణకవచాలుగా నిలుస్తున్నాయి.*

దేశంలోని ప్రజలకు తిండి, బట్ట, ఉద్యోగం ఇవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు అంబేద్కర్.
అందరికీ సమాన అవకాశాలుండాలని చెప్పారు. మహిళలకు రాజకీయ స్వాతంత్ర్యం ఉండాలని చెప్పిన అరుదైననేత అంబేద్కర్.

*దళితుల కోసం మాత్రమే కాదు దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన అసమాన నాయకుడు బాబా సాహెబ్. అంబేద్కర్ ను చదవకుండానే ఆయన్ను దళిత నాయకుడిగా ముద్రవేసిన చాలామందికి ఆయన చెప్పిన సమానత్వం ఎప్పటికీ అర్థం కుండానే ఉండిపోయింది.*

దేశంలో ఎన్ని మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నా భారతజాతి సమైక్యతను, సమగ్రతను కోరుకున్నాడు  బాబాసాహెబ్ అంబేద్కర్ గారు....

ప్రాథమిక హక్కుల పరిపూర్ణతత్వానికి, ఆదేశిక  సూత్రాలు జీవనాధారంగా  ఉన్నపుడే  సంక్షేమరాజ్యం సాధ్యం అవుతుంది ... 

*ఐక్యరాజ్య  సమితి (UNO) పౌరుల  ఎదుగుదల వారి వికాసము అవిభాజ్యము, అనుఉల్లంఘనీయమైన  " మానవ హక్కులు "  అని ప్రకటించడానికంటే ముందే ఈ ఆదేశిక  సూత్రాలును  రూపొందించిన  ఘనత  అంబెడ్కర్ గారికీ చెల్లుతుంది*.

(26th November, రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా)


Tuesday, November 28, 2017

TRT.TSPSC decided the syllabus of old text books of Telangana and Andhra pradesh before 2012.

Download DSC|TRT old syllabus books.Telangana governement released notification for recruitment of Teachers in various departments.SGT,SA,LAUNGUAGE PANDIT,PET,Physical Education,Exam will be conducted on February second week.TSPSC will conduct the exam of TRT.TSPSC decided the syllabus of old text books of Telangana and Andhra pradesh before 2012.there available Pragathi avanigadda old syllabus meterial For the students who appearing for SGT in telangana.



  • Click hear to Download Maths
  • Click hear to Download Biology
  • Click hear to Download Physics
  •  

    Click hear to Download Chemistry  

    Click hear to Download History  

    Click hear to Download Economics
  •  

  • Click hear to Download Civics
  • Click hear to Download Geography
  • Click hear to Download P.Ed (SGT & SA)



  •  

     

     

    Sunday, September 3, 2017

    ఆదేశిక_సూత్రాలు Political Science - Civics Study E Books

    Political Science  - Civics Study E Books











    Free Indian Political System PDF Download, Indian Political System PDF Download, Political Science E books Download, Political Science PDF E books Download Free Indian Political System PDF Download, Indian Political System PDF Download, Political Science E books Download, Political Science PDF E books Download Download, Political Science PDF E books
    Political Science  - Civics Study E Books Download, Political Science PDF E books
    Political Science  - Civics Study E Books Download, Political Science PDF E books
    Political Science  - Civics Study E Books Download, Political Science PDF E books
    Political Science  - Civics Study E Books Download, Political Science PDF E books
    Political Science  - Civics Study E Books Download, Political Science PDF E books

    Friday, April 14, 2017

    పంచాయతీరాజ్ ప్రకరణలు




    -ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ (1986):
    1986లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫారసులు చేయడానికి ఎల్‌ఎం సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలని, గ్రామపంచాయతీలకు ఆర్థిక వనరులను కల్పించాలని, కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయపంచాయతీలను ఏర్పాటు చేయాలని, గ్రామాలను పునర్‌వ్యవస్థీకరించాలని, గ్రామసభను ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహిస్తూ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫారసులు చేసింది.

    -ఆర్‌ఎస్ సర్కారియా కమిటీ (1988): క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలని, స్థానిక సంస్థలను రద్దుచేయడానికి సంబంధించి అన్ని రాష్ర్టాల్లోనూ ఒకేరకమైన చట్టాన్ని అమలు చేయాలని, పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ర్టాలకు అప్పగించాలని, స్థానిక సంస్థలను ఆర్థికంగాను, విధులపరంగాను పటిష్టపర్చాలని, దేశానికంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలని ఈ కమిటీ పేర్కొంది.

    -పీకే తుంగన్ కమిటీ (1988): గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంటు సంప్రదింపుల కమిటీ ఉపకమిటీ చైర్మన్ అయిన పీకే తుంగన్ అధ్యక్షతన ఈ కమిటీని 1988లో ఏర్పాటు చేశారు. దీన్ని పీకే తుంగన్ క్యాబినెట్ సబ్ కమిటీ అంటారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని, జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.

    73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992
    -ఎల్‌ఎం సింఘ్వీ, పీకే తుంగన్ కమిటీల సిఫారసుల మేరకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో 2/3వ వంతు మెజారిటీ పొందినప్పటికీ, రాజ్యసభలో 2 ఓట్లు తక్కువకావడంతో ఈ బిల్లు వీగిపోయింది.
    -తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం పంచాయతీలకు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 1990, సెప్టెంబర్ 7న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లు చర్చకు నోచుకోలేదు.
    -తర్వాత పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాల్సిన విషయాన్ని గుర్తించి 1991లో పంచాయతీలకు సంబంధించిన బిల్లును, మున్సిపాలిటీ (పురపాలక సంఘాలు)లకు సంబంధించిన బిల్లును వేర్వేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.
    -ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను 1992, డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదించింది. తర్వాత ఆ బిల్లులను రాష్ట్ర శాసనసభల్లో ఆమోదం కోసం పంపారు. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు (17 రాష్ర్టాలు) ఆ బిల్లులకు ఆమోదం తెలిపాయి.
    -అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాల్‌శర్మ ఆ బిల్లులపై సంతకం చేశారు. దీంతో 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
    -పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24ను పంచాయతీ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
    -పట్టణ, మున్సిపాలిటీలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
    -73వ రాజ్యాంగ సవరణ చట్టం- 1992 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1993, మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలో పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం కూడా కర్ణాటకే.

    నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రకరణలు

    -73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రాజ్యాంగంలోని IXవ భాగంలో 243, 243(A) నుంచి 243(O) వరకు గల మొత్తం 16 ప్రకరణల్లో పొందుపర్చారు.
    -73వ రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ చట్టం-1956 ద్వారా తొలగించిన IXవ భాగాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో కొత్తగా IXవ షెడ్యూల్‌ను కూడా చేర్చారు. పంచాయతీరాజ్ అంశం (స్థానిక సంస్థల పాలన, అధికారాలు) రాజ్యాంగంలోని VIIవ షెడ్యూల్‌లోని రాష్ట్ర జాబితాలో ఉంది.

    ప్రకరణ 243 నిర్వచనాలు
    1. జిల్లా అంటే ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
    2. గ్రామసభ అంటే గ్రామస్థాయిలో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహం.
    3. మాధ్యమిక స్థాయి అంటే జిల్లా స్థాయికి, గ్రామస్థాయికి మధ్యగల స్థాయి. దీనికి సంబంధించి ఏది మాధ్యమిక స్థాయిగా పరిగణిస్తారో గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు.
    4. పంచాయతీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 243(B) ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.
    5. పంచాయత్ ఏరియా అంటే ఒక పంచాయతీ ప్రాదేశిక ప్రాంతం.
    6. జనాభా అంటే చివరిగా జనాభా లెక్కల సేకరణ జరిగి ప్రచురించిన జాబితాలో గల జనాభా.
    7. గ్రామం అంటే గవర్నర్ ద్వారా గ్రామంగా నోటిఫై అయిన ప్రాంతం. అనేక గ్రామాలను కలిపి కూడా గ్రామంగా నోటిఫై చేసి ఉండవచ్చు.
    -ప్రకరణ 243(A) గ్రామసభ: గ్రామస్థాయిలో గ్రామసభ తన అధికార బాధ్యతలను శాసనసభ నిర్దేశించినవిధంగా చెలాయిస్తుంది.
    -ప్రకరణ 243B(1) ప్రకారం IXవ భాగంలోని నిబంధనలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రంలోనూ గ్రామ, మాధ్యమిక, జిల్లాస్థాయిల్లో పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
    -ప్రకరణ 243B(2) ప్రకారం 20 లక్షల జనాభా దాటని రాష్ర్టాల్లో మాధ్యమిక స్థాయిలో పంచాయతీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయనవసరం లేదు.
    -ప్రకరణ 243C పంచాయతీల నిర్మాణం, ఎన్నికల గురించి తెలుపుతుంది.
    -ప్రకరణ 243C(1) ప్రకారం పంచాయతీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధనలను రూపొందించాలి. పంచాయతీ పరిధిలోని జనాభా, ఆ పంచాయతీలో ఎన్నిక ద్వారా భర్తీ కావల్సిన సీట్ల మధ్య నిష్పత్తి వీలైనంతవరకు రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండాలి.
    -ప్రకరణ 243C(2) ప్రకారం పంచాయతీ స్థానాల నుంచి సభ్యుల ఎంపిక ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరుగుతుంది. అందుకు ప్రతి పంచాయతీని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గంలోని జనాభాకు, సీట్లకు మధ్యగల నిష్పత్తి కూడా వీలైనంతవరకు పంచాయతీ ఏరియా అంతటికీ ఒకే విధంగా ఉండాలి.
    -ప్రకరణ 243C(3) ప్రకారం పంచాయతీలో ప్రాతినిధ్యానికి సంబంధించి శాసనసభ కింద పేర్కొన్న విధంగా శాసనాలను చేయవచ్చు.
    1. గ్రామ పంచాయతీల అధ్యక్షులకు మాధ్యమిక పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం. మాధ్యమిక పంచాయతీలు లేని రాష్ర్టాల విషయంలో గ్రామపంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
    2. మాధ్యమిక పంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
    3. లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులకు తమ నియోజకవర్గాల పరిధిలోగల మాధ్యమిక, జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
    4. రాజ్యసభ, రాష్ట్ర శాసనపరిషత్తు సభ్యుల విషయంలో వారు ఓటరుగా ఎక్కడ నమోదయ్యారన్న అంశం ఆధారంగా మాధ్యమిక పంచాయతీలోగాని లేక జిల్లా పంచాయతీలోగాని ప్రాతినిధ్యం కల్పిస్తారు.
    -ప్రకరణ 243C(4) ప్రకారం పంచాయతీ అధ్యక్షులకు, పంచాయతీ సభ్యులందరికీ (ప్రత్యక్షంగా ఎన్నికయ్యారా లేదా అన్నదాంతో సంబంధంలేకుండా) పంచాయతీ సమావేశాల్లో ఓటింగ్‌లో పాల్గొనే హక్కు ఉంటుంది.
    -ప్రకరణ 243C(5) ప్రకారం గ్రామస్థాయిలో పంచాయతీ అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి శాసనసభ నిబంధనలు జారీచేస్తుంది. మాధ్యమిక, జిల్లా పంచాయతీల అధ్యక్షులను ఆయా పంచాయతీల్లోని ఎన్నికైన సభ్యుల నుంచి ఎన్నుకుంటారు.
    -ప్రకరణ 243D పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది




    Thursday, April 13, 2017

    పంచాయతీరాజ్ ప్రకరణలు


    పంచాయతీరాజ్ ప్రకరణలు

    -ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ (1986):
    1986లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫారసులు చేయడానికి ఎల్‌ఎం సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలని, గ్రామపంచాయతీలకు ఆర్థిక వనరులను కల్పించాలని, కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయపంచాయతీలను ఏర్పాటు చేయాలని, గ్రామాలను పునర్‌వ్యవస్థీకరించాలని, గ్రామసభను ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహిస్తూ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫారసులు చేసింది.

    -ఆర్‌ఎస్ సర్కారియా కమిటీ (1988): క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలని, స్థానిక సంస్థలను రద్దుచేయడానికి సంబంధించి అన్ని రాష్ర్టాల్లోనూ ఒకేరకమైన చట్టాన్ని అమలు చేయాలని, పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ర్టాలకు అప్పగించాలని, స్థానిక సంస్థలను ఆర్థికంగాను, విధులపరంగాను పటిష్టపర్చాలని, దేశానికంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలని ఈ కమిటీ పేర్కొంది.

    -పీకే తుంగన్ కమిటీ (1988): గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంటు సంప్రదింపుల కమిటీ ఉపకమిటీ చైర్మన్ అయిన పీకే తుంగన్ అధ్యక్షతన ఈ కమిటీని 1988లో ఏర్పాటు చేశారు. దీన్ని పీకే తుంగన్ క్యాబినెట్ సబ్ కమిటీ అంటారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని, జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.

    73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992
    -ఎల్‌ఎం సింఘ్వీ, పీకే తుంగన్ కమిటీల సిఫారసుల మేరకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో 2/3వ వంతు మెజారిటీ పొందినప్పటికీ, రాజ్యసభలో 2 ఓట్లు తక్కువకావడంతో ఈ బిల్లు వీగిపోయింది.
    -తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం పంచాయతీలకు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 1990, సెప్టెంబర్ 7న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లు చర్చకు నోచుకోలేదు.
    -తర్వాత పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాల్సిన విషయాన్ని గుర్తించి 1991లో పంచాయతీలకు సంబంధించిన బిల్లును, మున్సిపాలిటీ (పురపాలక సంఘాలు)లకు సంబంధించిన బిల్లును వేర్వేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.
    -ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను 1992, డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదించింది. తర్వాత ఆ బిల్లులను రాష్ట్ర శాసనసభల్లో ఆమోదం కోసం పంపారు. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు (17 రాష్ర్టాలు) ఆ బిల్లులకు ఆమోదం తెలిపాయి.
    -అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాల్‌శర్మ ఆ బిల్లులపై సంతకం చేశారు. దీంతో 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
    -పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24ను పంచాయతీ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
    -పట్టణ, మున్సిపాలిటీలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
    -73వ రాజ్యాంగ సవరణ చట్టం- 1992 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1993, మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలో పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం కూడా కర్ణాటకే.

    నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రకరణలు

    -73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రాజ్యాంగంలోని IXవ భాగంలో 243, 243(A) నుంచి 243(O) వరకు గల మొత్తం 16 ప్రకరణల్లో పొందుపర్చారు.
    -73వ రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ చట్టం-1956 ద్వారా తొలగించిన IXవ భాగాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో కొత్తగా IXవ షెడ్యూల్‌ను కూడా చేర్చారు. పంచాయతీరాజ్ అంశం (స్థానిక సంస్థల పాలన, అధికారాలు) రాజ్యాంగంలోని VIIవ షెడ్యూల్‌లోని రాష్ట్ర జాబితాలో ఉంది.

    ప్రకరణ 243 నిర్వచనాలు
    1. జిల్లా అంటే ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
    2. గ్రామసభ అంటే గ్రామస్థాయిలో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహం.
    3. మాధ్యమిక స్థాయి అంటే జిల్లా స్థాయికి, గ్రామస్థాయికి మధ్యగల స్థాయి. దీనికి సంబంధించి ఏది మాధ్యమిక స్థాయిగా పరిగణిస్తారో గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు.
    4. పంచాయతీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 243(B) ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.
    5. పంచాయత్ ఏరియా అంటే ఒక పంచాయతీ ప్రాదేశిక ప్రాంతం.
    6. జనాభా అంటే చివరిగా జనాభా లెక్కల సేకరణ జరిగి ప్రచురించిన జాబితాలో గల జనాభా.
    7. గ్రామం అంటే గవర్నర్ ద్వారా గ్రామంగా నోటిఫై అయిన ప్రాంతం. అనేక గ్రామాలను కలిపి కూడా గ్రామంగా నోటిఫై చేసి ఉండవచ్చు.
    -ప్రకరణ 243(A) గ్రామసభ: గ్రామస్థాయిలో గ్రామసభ తన అధికార బాధ్యతలను శాసనసభ నిర్దేశించినవిధంగా చెలాయిస్తుంది.
    -ప్రకరణ 243B(1) ప్రకారం IXవ భాగంలోని నిబంధనలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రంలోనూ గ్రామ, మాధ్యమిక, జిల్లాస్థాయిల్లో పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
    -ప్రకరణ 243B(2) ప్రకారం 20 లక్షల జనాభా దాటని రాష్ర్టాల్లో మాధ్యమిక స్థాయిలో పంచాయతీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయనవసరం లేదు.
    -ప్రకరణ 243C పంచాయతీల నిర్మాణం, ఎన్నికల గురించి తెలుపుతుంది.
    -ప్రకరణ 243C(1) ప్రకారం పంచాయతీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధనలను రూపొందించాలి. పంచాయతీ పరిధిలోని జనాభా, ఆ పంచాయతీలో ఎన్నిక ద్వారా భర్తీ కావల్సిన సీట్ల మధ్య నిష్పత్తి వీలైనంతవరకు రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండాలి.
    -ప్రకరణ 243C(2) ప్రకారం పంచాయతీ స్థానాల నుంచి సభ్యుల ఎంపిక ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరుగుతుంది. అందుకు ప్రతి పంచాయతీని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గంలోని జనాభాకు, సీట్లకు మధ్యగల నిష్పత్తి కూడా వీలైనంతవరకు పంచాయతీ ఏరియా అంతటికీ ఒకే విధంగా ఉండాలి.
    -ప్రకరణ 243C(3) ప్రకారం పంచాయతీలో ప్రాతినిధ్యానికి సంబంధించి శాసనసభ కింద పేర్కొన్న విధంగా శాసనాలను చేయవచ్చు.
    1. గ్రామ పంచాయతీల అధ్యక్షులకు మాధ్యమిక పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం. మాధ్యమిక పంచాయతీలు లేని రాష్ర్టాల విషయంలో గ్రామపంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
    2. మాధ్యమిక పంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
    3. లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులకు తమ నియోజకవర్గాల పరిధిలోగల మాధ్యమిక, జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
    4. రాజ్యసభ, రాష్ట్ర శాసనపరిషత్తు సభ్యుల విషయంలో వారు ఓటరుగా ఎక్కడ నమోదయ్యారన్న అంశం ఆధారంగా మాధ్యమిక పంచాయతీలోగాని లేక జిల్లా పంచాయతీలోగాని ప్రాతినిధ్యం కల్పిస్తారు.
    -ప్రకరణ 243C(4) ప్రకారం పంచాయతీ అధ్యక్షులకు, పంచాయతీ సభ్యులందరికీ (ప్రత్యక్షంగా ఎన్నికయ్యారా లేదా అన్నదాంతో సంబంధంలేకుండా) పంచాయతీ సమావేశాల్లో ఓటింగ్‌లో పాల్గొనే హక్కు ఉంటుంది.
    -ప్రకరణ 243C(5) ప్రకారం గ్రామస్థాయిలో పంచాయతీ అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి శాసనసభ నిబంధనలు జారీచేస్తుంది. మాధ్యమిక, జిల్లా పంచాయతీల అధ్యక్షులను ఆయా పంచాయతీల్లోని ఎన్నికైన సభ్యుల నుంచి ఎన్నుకుంటారు.
    -ప్రకరణ 243D పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది.

    Saturday, March 4, 2017

    GROUP-II PAPER- 2 POLITY భారత రాజ్యాంగ లక్షణాలు













    Tags:rao iit academy video lectures  rao iit academy study material  rao iit chemistry video lectures  rao iit academy student login  rao iit academy chemistry  rao iit academy physics  rao iit chemistry lectures  rao iit academyTags:ts gurukulam notification  tspsc gurukulam syllabus 2016  ts gurukulam tgt syllabus  ts gurukulam syllabus 2016  ts gurukulam recruitment  gurukulam recruitment 2016 telangana  telangana gurukulam syllabus  ts gurukulam application form rao iit academy video lectures  rao iit academy study material  rao iit chemistry video lectures  rao iit academy student login  rao iit academy chemistry  rao iit academy physics  rao iit chemistry lectures  rao iit academy youtube

    Monday, November 30, 2015

    విద్యను హక్కు చట్టం




    విద్యను హక్కుగా పొందే చట్టం అనగా నేమి?
    • ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలికలకు ఉచిత విద్య మరియు నిర్భంధిత విద్యను హక్కుగా కల్పించబడింది. ఇది 86 వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 21 ఎ కి అనుబంధంగా కల్పించబడింది. ఉచితంగా విద్యను హక్కుగా పొందే ఈ సవరణ వలన మంచి పరిణామము ఇవ్వాలని కోరుతుంది.
    • పాఠశాల నిర్వహణాసంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలందరికీ ఉచిత విద్యను కల్పించాలి. ప్రైవేటు పాఠశాలలు తమ పాఠశాలలలో 25 శాతం పిల్లలకు ఎటువంటి రుసుము లేకుండా ప్రవేశము కల్పించాలి.
    • నాణ్యతతో పాటు అన్ని రకాల ప్రాథమిక విద్యా విషయాలను పర్యవేక్షించుటకు గాను జాతీయ సంఘం ఏర్పాటు చేయాలి.

    చట్టం పరిణామ క్రమము

    డిశెంబరు 2002
    86 వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ఆర్టికల్ 21 ఎ మూడవ భాగం ద్వారా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరముల లోపు వయస్సు గల పిల్లలకు నిర్భంద ఉచిత విద్య, ప్రాథమిక హక్కుగా చేసేందుకు ఉద్దేశింప బడింది.
    అక్టోబరు 2003
    పిల్లలకు ఉచిత నిర్భంధ విద్యా బిల్లు 2003 పై ఆర్టికల్లో అనుకున్న విధంగా మొదటి ముసాయిదా చట్టాన్ని అక్టోబరు 2003లో తయారు చేసి పెద్ద మొత్తంలో ప్రజా స్పందనకు మరియు సూచనలను పొందుటకుగాను ఈ క్రింది వెబ్ సైట్ లో ఉంచబడింది.
    2004 ఆ తర్వాత ఈ బిల్లు ముసాయిదా పై వచ్చిన సూచనలననుసరించి ఉచిత నిర్భంధ విద్యాబిల్లు 2004 కి సంబంధించిన మార్పుచేసిన బిల్లు ముసాయిదా తయారు చేసి ఈ క్రింది వెబ్ సైట్ లో పెట్టబడింది.


    జూన్ 2005
    కేంద్రీయ విద్యాసలహా సంఘము (సి ఎ బి ఇ) కమిటీ తయారు చేసిన ఉచిత నిర్భంద విద్య బిల్లు ముసాయిదా ను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సమర్పించారు. మానవ వనరుల మంత్రిత్వశాఖ జాతీయ సలహా మండలి (ఎన్ ఎ సి) చైర్మన్ అయిన శ్రీమతి సోనియా గాంధీకి పంపించారు. జాతీయ సలహామండలి బిల్లుని ప్రధాన మంత్రికి పరిశీలన కొరకై పంపించింది .
    పద్నాల్గవ (14) తేదీ జులై 2006
    ఆర్థిక శాఖ, ప్లానింగ్ కమీషన్ లు నిధుల లేవని చెప్పి ఈ బిల్లును ఆమోదించలేదు. ఈ బిల్లు ముసాయిదాను అవసరమైన ఏర్పాట్లు కొరకు రాష్ట్రాలకు పంపబడినది. (86 వ రాజ్యాంగ సవరణ తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల లేమిని ఎప్పుడో ప్రకటించాయి).
    పంతొమ్మిదవ (19) తేదీ జులై 2006
    బాలకార్మిక నిర్మూలన ప్రచారము (సి ఎ సి ఎల్), విద్యను ప్రాథమిక హక్కు గా రావడానికి కృషిచేసే జాతీయ కూటమి (ఎస్ ఎ ఎఫ్ ఇ), జాతీయ విద్యా విధాన సలహా మండలి (ఎన్ ఎ ఎఫ్ ఆర్ ఇ), కేంద్రీయ విద్యాసలహా సంఘము (సి ఎ బి ఇ) మొదలగునవి భారత అక్షరాస్యతా పథకము (ఐ ఎల్ పి) మరియు ఇతర సంస్థలను ఆహ్వానించి ప్రణాళికా సమావేశము ఏర్పాటుచేసి, ఆ సమావేశములో పార్లమెంటులో ఈ చర్య ప్రభావము మరియు సమర్ధన చర్యలు ఎలా మొదలుపెట్టాలి మరియు జిల్లా, పల్లెల స్థాయిలో ఏ విధంగా అమలు పరచ వలెనో దిశానిర్ధేశకం చేయడంపై చర్చించాయి.

    ఈ చట్టం పై తరచుగా అడగబడు ప్రశ్నలు

    1. ఈచట్టం ఎందుచేత అత్యంత ఆవశ్యకము?
    రాజ్యాంగ సవరణను అమలు పరచుటలో ప్రభుత్వం యొక్క చురుకైన పాత్రకు ఇది మొదటి మెట్టు కాబట్టి ఈ బిల్లు ముఖ్యమైనది. మరియు చట్టం ఎందువలన ముఖ్యమైనదంటే:
    • ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య మరియు తరువాత స్థాయి విద్య ఏర్పాటుని శాసననిర్మాణం చేస్తుంది.
    • ప్రతి ఆవాసానికి ఒక పాఠశాలని ఏర్పాటు చేస్తుంది.
    • పాఠశాల పర్యవేక్షక కమిటీ (పాఠశాల నిర్వహణను పర్యవేక్షించే ఆ ఆవాసంలో గల ఎన్నికైన సభ్యులు) ఏర్పాటు చేస్తుంది
    • ఆరు నుండి పద్నాలుగు (6-14) సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలెవరూ పనిలోకి వెళ్ళకుండా శాసనం చేస్తుంది.
    ఇటువంటి మంచి చర్యలు ప్రజల విద్యా విధానము అభివృద్ధికై పునాదిగా ఉపయోగబడి, నాణ్యమైన విద్య అందరి పిల్లలకి కల్పించబడేటట్లు చేస్తాయి. తద్వారా సాంఘికంగా మరియు ఆర్థికంగా బహిష్కరణకు ప్రజలు గురికావడం నివారింపబడుతుంది.
    ఎందువలన 6-14సంవత్సరముల వయస్సుగల పిల్లల గ్రూపునే ఎంచుకోవాలి?
    ఈ చట్టం ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య, నిర్భంధంగా పిల్లలందరికీ కల్పించబడేటట్లు కేంద్రీకరిస్తుంది. ఈ వయస్సుగల పిల్లల గ్రూపుకి, ఈ నిర్భంధవిద్యను కల్పించబడడం ద్వారా వారి భవితకు పునాది ఏర్పాడుతుంది.
    చట్టం ఎందుకు ప్రాముఖ్యం మరియు భారతదేశానికి ఎటువంటి మేలు చేస్తుంది?
    పిల్లల హక్కైన ఉచిత మరియు తప్పనిసరి విద్యా చట్టం 2009 (ఆర్ టి ఇ) జారీచేయుట భారతదేశ విద్యార్ధుల చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలుస్తుంది
    నాణ్యమైన ప్రాధమిక విద్యను ఆర్జించడానికి ప్రతి బాలుడు/ బాలికకు తమ హక్కుగా ఈ చట్టం ఒక స్థాపనా అమరికలా పనిచేస్తుంది మరియు కుటుంబాలు మరియు కమ్యూనిటీల సహాయంతో రాష్ట్రం ఈ బాధ్యతని నిర్వర్తిస్తుంది.
    ప్రపంచంలో కొన్ని దేశాలకు పిల్లలకు ఉచిత మరియు పిల్లల కేంద్రితమైన, పిల్లలకి స్నేహ పూర్వకంగా ఉండే విద్యను అందించడానికి అటువంటి జాతీయ సదుపాయం కలదు.
    ‘ఉచిత మరియు తప్పనిసరి ప్రాధమిక విద్య’ అంటే ఏమిటి?
    6 నుండి 14 వయస్సులోపు అందరి పిల్లలకు దగ్గరున్న పాఠశాలలో ఉచిత మరియు తప్పనిసరి విద్య అర్జించే హక్కుకలదు.
    పిల్లలు కాని తల్లిదండ్రులు కాని ప్రాధమిక విద్యని అభ్యసించడానికి, ప్రత్యక్షమైన (స్కూల్ ఫీజు) లేదా పరోక్షమైన (యూనిఫార్మ్ లు, టెక్ట్స్ బుక్ లు, మధ్యాహ్న భోజనం, రవాణా) ఖర్చులు భరించనవసరం లేదు. ఒక పిల్లవాడు ప్రాధమిక విద్యను పూర్తి చేసే వరకు ప్రభుత్వం ఉచితంగా చదువుని అందిస్తుంది.
    ఆర్ టి ఇ ని సాధించడానికి కమ్యూనిటీకి మరియు తల్లిదండ్రులకి పోషించే పాత్ర ఏమిటి?
    పిల్లల హక్కైన ఉచిత మరియు తప్పనిసరి విద్యా చట్టం 2009 (ఆర్ టి ఇ) జారిచేయుట భారతదేశ విద్యార్ధుల చరిత్రలోఒక మైలురాయిగా నిలుస్తుంది. భారతదేశపు చరిత్రలో మొట్ట మొదటి సారిగా, కుటుంబాలు మరియు కమ్యూనిటీల సహాయంతో రాష్ట్రం ద్వారా నాణ్యమైన ప్రాధమిక విద్యను పొందే హక్కును అందించే హామీ ఇస్తుంది.
    విద్యార్ధులకు వారి పూర్తి సామర్ధ్యాన్ని అభివృద్ధి పరుచుకోవడంలో దోహదపడేలా చూడడానికి, ప్రపంచంలోని కొన్ని దేశాలు పిల్లల కేంద్రితమైన, పిల్లలకి స్నేహపూర్వకంగా ఉండే విద్యను అందించే జాతీయ సదుపాయం కలదు. 2009 లో, 6 నుంచి 14 వయస్సు లోపు పాఠశాలకు వెళ్ళని పిల్లలు 8 మిలియన్లు ఉన్నారని అంచనా. భారతదేశము లేకుండా 2015 నాటికి ప్రతి పిల్లవానికి పూర్తి ప్రాధమిక విద్య అనే లక్ష్యాన్ని ప్రపంచం చేరుకొలేదు.
    స్థానిక అధికార ఉద్యోగులు, తల్లిదండ్రులు, గార్డియన్లు మరియు టీచర్లతో పాఠశాలలు, పాఠశాలల నిర్వహణ సంఘాన్ని (ఎస్ ఎమ్ సి లని) నియమించాలి. ఎస్ ఎమ్ సి లు, పాఠశాల అభివృద్ధి పథకాలని తయారు చేయడం మరియు ప్రభుత్వపు ధనాన్ని వినియోగాన్ని మరియు మొత్తం పాఠశాల వాతావరణాన్ని ఎస్ ఎమ్ సి ఎస్ లు పర్యవేక్షించాలి.
    ఎస్ ఎమ్ సి లలో లాభం పొందని గ్రూపుల నుండి 50 శాతం ఆడవాళ్ళని మరియు తల్లిదండ్రులని చేర్చుకోవాలని కూడా ఆర్ టి ఇ తీర్మానిస్తుంది. బాలురకి మరియు బాలికలకి వేరు వేరు మరుగుదొడ్ల సదుపాయాలు మరియు ఆరోగ్యం, నీరు, పారిశుధ్యం మరియు ఆరోగ్య సమస్యలకి తగినంత శ్రద్ధ అందించడం ద్వారా స్నేహపూర్వకమైన “పూర్తి పాఠశాల” వాతావరణాన్ని కల్పించడంలో ఇటువంటి సంఘం కీలక పాత్ర వహిస్తుంది.
    ఆర్ టి ఇ బాల్య స్నేహపూర్వక పాఠశాలలను ఎలా ప్రోత్సాహిస్తుంది?
    ప్రభావితంగా అభ్యాసించే వాతావరణం కోసం, అన్ని పాఠశాలలు అవస్థాపన వసతులు మరియు ఉపాధ్యాయ ప్రమాణాలని పాటించాలి. ప్రాధమిక స్థాయిలో, ప్రతీ 60 మంది విద్యార్థులకు ఇద్దరు శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమిస్తారు.
    ఉపాధ్యాయులు పాఠశాలకు క్రమం తప్పకుండా మరియు సమయానికి పాఠశాలకు హాజరుకావాలి పూర్తి పాఠ్యప్రణాళికలని పూర్తి చేయాలి, అభ్యాస సామర్ధ్యాలను అంచనా వేయాలి, ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాలను క్రమంగా నిర్వహించాలి. గ్రేడు ఆధారంగా కన్నా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్య ఆధారపడి ఉంటుంది.
    విద్యార్థుల మెరుగైన అభ్యాస ఫలితాలను అందించే ఉపాధ్యాయులకు ప్రభ్యుత్వం సంతృప్తికరమైన సహాయం అందించాలి. సమానత్వంతో కూడిన పాఠశాల నాణ్యతను అందించడానికి, ఎస్ ఎమ్ సి ల సహాయ సహాకారంతో కమ్యూనిటీలు మరియు పౌరసంఘాలు ప్రముఖపాత్ర పోషించాలి. ప్రతి పిల్లవానికి ఆర్. టి. ఇ ను నిజమయ్యేలా చేయడానికి, రాష్ట్రం పోలసీ విధానాలని ఇస్తుంది మరియు సమర్ధవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
    భారతదేశంలో ఆర్ టి ఇ కి ఏ విధంగా ఆర్ధికసహాయం ఇవ్వబడుతుంది మరియు అమలు పరుస్తారు?
    నాణ్యమైన ప్రాధమిక విద్యను ఆర్జించడానికి ప్రతి బాలుడు/ బాలికకు తమ హక్కుగా ఈ చట్టం ఒక స్థాపనా అమరికలా పనిచేస్తుంది మరియు కుటుంబాలు మరియు కమ్యూనిటీల సహాయంతో రాష్ట్రం ఈ బాధ్యతని నిర్వర్తిస్తుంది.
    ప్రపంచంలో కొన్ని దేశాలకు పిల్లలకు ఉచిత మరియు పిల్లల కేంద్రితమైన, పిల్లలకి స్నేహ పూర్వకంగా ఉండే విద్యను అందించడానికి అటువంటి జాతీయ సదుపాయం కలదు.
    ఆర్ టి ఇ కొరకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక భాధ్యతలను పంచుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఖర్చుల అంచనాలను తయారుచేస్తుంది. ఈ ఖర్చులలో కొంత శాతం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వబడును.
    ఆర్. టి. ఇ యొక్క సదుపాయాలను నిర్వహించడానికి రాష్ట్రానికి అదనపు వనరులను అందించ డానికి, కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సంఘాన్ని అభ్యర్ధించవచ్చు.
    ఆచరణకు అవసరమైన మూలధనమును అందించుటలో రాష్ట్ర ప్రభుత్వం భాద్యత వహిస్తుంది. నిధుల కొరత ఉంటుంది. దీనిని పౌర సంఘం, అభివృద్ధి సంస్థలు, కోర్పరేట్ సంస్థల నుండి భాగస్వాముల దగ్గర నుండి మరియు దేశ పౌరులు నుండి మద్దతు తీసుకోవలసి ఉంటుంది.
    ఆర్ టి ఇ ని సాధించడానికి ముఖ్యమైల సమస్యలు ఏమిటి?
    ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుండి ఆర్ టి ఇ చట్టం ఆచరణలోకి వస్తుంది. వీలైనంత త్వరగా ప్రకటించడానికి మరియు రాష్ట్రాలు తమ నియమాలను రూపొందించడానికి అవసరమయ్యే డ్రాఫ్ట్ నమూన నియమాలు ప్రభుత్వాలతో పంచుకోబడతాయి.
    బాల కార్మికులు, వలస వచ్చిన పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు లేదా “సాంఘిక, ఆర్ధిక, భౌగోళిక, భాష, లింగపరంగా లేదా అటువంటి కారణం వలన” నష్టపడిన పిల్లలు వంటి ప్రయోజనము చేకూరని గ్రూపులకి ప్రత్యేకమైన ఏర్పాట్లతో, ఆర్ టి ఇ అందనివారికి ఒక మంచి ప్లాట్ ఫార్మ్ ని అందిస్తుంది. విధంగా ప్రత్యేక సదుపాయాలతో లాభపడని తెగలకు గట్టి ఆధారం అందిస్తుంది. వేగవంతమైన ప్రయత్నాలు మరియు పెద్ద మొత్తంలో సంస్కరణలు అవసరమయ్యే శిక్షణ మరియు అభ్యాసం యొక్క నాణ్యత మీద అర్ టి ఇ దృష్టి కేంద్రీకరిస్తుంది :

    • రానున్న 5 సంవత్సరాలలో, 1 మిలియన్ కన్నా ఎక్కువ క్రొత్త మరియు శిక్షణ ఇవ్వని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి మరియు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నైపుణ్యాలని పటిష్ట పరచి, స్నేహసంబంధ బాల్య విద్యని అందించడానికి సృజనాజత్మకమైన మరియు నిలకడ అయిన చొరవలు కీలకమైనవి.
    • భారతదేశంలో నేటికి ప్రాధమిక విద్య అభ్యసించవలసిన 190 మిలియన్ల బాలురు బాలికలు ప్రతి ఒక్కరకి స్నేహసంబంధ బాల్య విద్యని సమకూర్చడానికి, కుటుంబములు మరియు కమ్యూనిటీలు కూడా చాలా పెద్ద పాత్రని పోషించాలి.
    • సమానత్వంతో కూడిన నాణ్యతను ఇవ్వడానికి తారతమ్యములను నిర్మూలించవలెను. ఫ్రీ స్కూల్ లో పెట్టుబడి పెట్టుటయే గమ్యములను చేరుకొనుటకు ముఖ్య వ్యూహరచన.
    • పాఠశాలలో చేరని 8 మిలియన్ల పిల్లల్ని తరగతుల లోకి సరైన వయస్సులో పాఠశాలలో తీసుకువచ్చి సహకారంతో ఉండడానికి సహకరించి, విజయవంతం కావడానికి అనుకూల మైన, సృజనాత్మక దృక్పధములు ఎంతో అవసరం.
    ఆర్ టి ఇ ని ఉల్లంఘించినట్లయితే ఏ చర్య అందుబాటులో ఉంది?
    ఈ చట్టం క్రింద ఇచ్చిన హక్కుల రక్షకాలను, పిల్లల హక్కుల రక్షణ జాతీయ సమితి సమీక్షించి, ఫిర్యాదులను పరిశోధించి మరియు విచారణ చేస్తున్న కేసులలో, సివిల్ కోర్టు పవర్లను కలిగి ఉంటుంది.
    ఏప్రిల్ 1 నుండి ఆరు నెలలు లోపు, పిల్లల హక్కుల రక్షణ కొరకు ఒక రాష్ట్ర సమితిని (ఎస్ సి పి సి ఆర్) లేదా విద్యా హక్కు రక్షణ అధారిటీ (ఆర్ ఇ పి ఎ) ని రాష్ట్రాలు నియమించాలి. స్థానిక అధికారు లకి, ఏ వ్వక్తి అయినా ఒక సమస్యని ఫైల్ చేయాలనుకుంటే, వ్రాత పూర్వకంగా ఫిర్యాదును అందించాలి.ఎస్ సి పి సి ఆర్/ఆర్ ఇ పి ఎ చే విన్నపములు నిర్ణయించబడతాయి. సముచితమైన ప్రభుత్వముచే అధికారం ఇవ్వబడిన ఆఫీసర్ యొక్క ఆమోదం ఫిర్యాదుల పరిశీలనకు అవసరం.
    ఆర్ టి ఇ యదార్ధంగా ఏవిధంగా కార్య రూపం దాల్చుతుంది?
    సమానత్త్వంతో నాణ్యతను అందించడంలో మరియు తారతమ్యములను నిర్మూనించుటకు గట్టి ప్రయత్నాలు అవసరం. సెలబ్రిటి ప్రపంచం, సమాచార సాధనం, ఉపాధ్యాయ సంస్థలు, పౌర సంఘం, ప్రభుత్వం నుండి సంబధిత స్టేక్ హోల్డర్స్ ఒక చోటికి చేర్చడంలో యూనిసెఫ్ ముఖ్య పాత్రను నిర్వహిస్తుంది.
    కార్యరూపం దాల్చడానికి పిలుపునివ్వడానికి మరియు ప్రజలలో అవగాహన పెంచడానికి యూనిసెఫ్ భాగస్వాములను పంపిస్తుంది. పిల్లలకు మెరుగైన ఫలితాలు ఇవ్వడంలో, ప్రాప్యత మరియు నాణ్యమైన విద్యని మెరుగుపరచడం మీద పోలసీ మరియు పధకము రూపకల్పన/అమలు దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఆర్ టి ఇ పై, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ సంఘాలను పటిష్టం చేయడానికి, యూనిసెఫ్ భాగస్వాములతోకూడా కలిసి పనిచేస్తుంది.
    ఆధారము: యూనిసెఫ్

    విద్యను హక్కుగా పొందే బిల్లుని ఆమోదించిన భారతదేశం

    భారతరాజ్యాంగంలో సవరణ చేసిన ఆరు సంవత్సరాల తరువాత, యూనియన్ క్యాబినెట్ విద్యను హక్కుగా పొందే బిల్లుని ఆమోదించింది. ప్రతి బాలబాలికలకు ఉచిత విద్య మరియు నిర్భంధిత విద్య పొందే ప్రాథమిక హక్కుని ఆమోదించడానికి ఇప్పుడు తొందరలో పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు.
    ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలికలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పించే ప్రాథమిక హక్కు బిల్లుని భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చిన ఆరు కన్నా ఎక్కువ దశాబ్దాల
    తరువాత ఆమోదించింది.
    ప్రతి బాలబాలికలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పించే విద్యాహక్కు బిల్లుని యూనియన్ క్యాబినెట్ ఎంతోకాలం తరువాత ఆమోదించింది. విద్యారంగ అభివృద్ధికి ఇది ఎంతగానో శక్తిని ఇస్తుంది.
    ఇరుగు పొరుగునున్న సౌలభ్యంలేని పిల్లలకి ప్రైవేటు పాఠశాలలలో 25 శాతం రిజర్వేషన్లు ప్రారంభదశలో కల్పించే ముఖ్యమైన నిభంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. పిల్లలకి అయ్యే ఖర్చు ప్రభుత్వం పాఠశాలలకు ఇస్తుంది. ప్రవేశ రుసుము తీసుకోకూడదని, ప్రవేశానికి పిల్లలని లేదా తల్లిదండ్రుల్ని ఇంటర్వ్యూ చేయకూడ దన్న నిభంధనలు కూడా ఈ బిల్లులో ఉన్నాయి.
    పిల్లలని భౌతికంగా దండించడం, బహిష్కరించడం లేదా నిర్భంధించడం మరియు ఉపాధ్యాయుల్ని జనాభా లెక్కలు లేదా ఎన్నికల మరియు ఆపద్కాల ఉపశమన బాధ్యతలు తప్ప ఇతర బాధ్యతల్లో నియుక్తించడాన్ని ఈ బిల్లులో నిషేధించారు. గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే చట్టబద్దంగా చర్య తీసుకుంటారు.
    పిల్లలకిచ్చిన ముఖ్యమైన మాటగా, విద్య ఒక ప్రాథమికహక్కు అవుతుండడంతో కేంద్ర మరియు రాష్ట్రాలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పించడం చట్టపరంగా తీసుకోవలసిన బాధ్యత అని పి. చిదంబరం చెప్పారు.
    కొన్ని రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల కమిషన్ తో సంప్రదించిన తరువాత మానవ వనరుల మంత్రిత్వ శాఖ బిల్లుని విడుదల చేస్తుందని ఆయన చెప్పారు.
    ఈ బిల్లుని పరిశీలించే పనిని మంత్రుల సముదాయాని (జి ఒ ఎమ్)కి ఇచ్చారు. ఈ బిల్లులోని అంశాల్ని ఏమాత్రం మార్చకుండా ఈనెల మొదట్లో ముసాయిదా చట్టాన్ని మంత్రుల సముదాయం ఆమోదించారు. ఇరుగు పొరుగునున్న సౌలభ్యంలేని పిల్లలకి ప్రైవేటు పాఠశాలలలో 25 శాతం రిజర్వేషన్లు ప్రారంభదశలో కల్పించే నిభంధన కూడా ఉంచారు. ప్రైవేటురంగం ద్వారా రాష్ట్రంయొక్క చట్ట బాధ్యతల్ని నెరవేర్చడానికి ఇది ఒక మార్గంగా కొంత మంది భావిస్తున్నారు.
    86 వ రాజ్యాంగ సవరణ ప్రకటించడానికి విద్యా హక్కు బిల్లు చట్టానికి తోడ్పడింది. ఇది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాల బాలికలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పిస్తుంది. ఇది చేయడానికి 61 సంవత్సరాలు పట్టింది.
    1937 సంవత్సరములో మహాత్మాగాంధి అందరికి విద్య అవసరమని చెప్పినప్పుడు, ఇప్పటి సమస్య లాగానే ఖర్చు ఒక అడ్డు గోడలా ఎదురయింది. పద్నాలుగు సంవత్సరాలు వయస్సు గల అందరి పిల్లలకి ఉచిత మరియు నిర్భంధిత విద్య కల్పించడం అనిర్దుష్టమయిన మనవి అని రాజ్యాంగం విడిచి పెట్టింది. కాని ప్రాథమిక పాఠశాల ప్రవేశము ఈ రోజులలో కూడా సందేహాస్పదమే.
    2002 సంవత్సరములోనే, విద్యని ప్రాథమిక హక్కుగా 86 రాజ్యాంగ సవరణలో చేయ బడింది.
    2004 సంవత్సరములో ప్రభుత్వాధికారంలోనున్న జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్ డి ఎ) ముసాయిదా పత్రాన్ని తయారుచేసింది. కానీ అది ప్రవేశపెట్టేలోపలే ఎన్నికలలో ఓటమిని చవి చూసింది. ప్రస్తుతం అధికారం లోనున్న సంకీర్ణ ప్రగతి శీల కూటమి (యు పి ఎ) యొక్క నమూనా బిల్లు, కేంద్ర రాష్ట్రాల మధ్యలో నిధులు మరియు బాధ్యతల విషయంల్లో అల్లాడి పోతుంది.
    బిల్లులో ఉన్న వయోనిభంధనలపై విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఆరు సంవత్సరముల క్రింద మరియు పద్నా లుగు సంవత్సరాల పైన ఉన్న పిల్లలని కూడా కలపాలని చెపుతున్నారు. ఉపాధ్యాయుల కొరత, తక్కువ నైపుణ్యంగల ఎంతోమంది ఉపాధ్యాయులు మరియు విద్యా అవస్థాపక సౌకర్యాల కొరతలు ఉన్న ప్రస్తుత పాఠశాలల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం క్రొత్త పాఠశాలల్ని మాత్రమే నిర్మించి అభివృద్ది చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
    ఈ బిల్లు న్యాయ మరియు ఆర్ధిక మంత్రిత్వశాఖల నుండి రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక సహకారము విషయంలో వ్యతిరేకత ఎదురైంది. కేంద్ర మంత్రిత్వశాఖ రిజర్వేషన్లలో 25 శాతము పెంపు విషయంలో ఆటంకములు ఎదురౌతాయని భావించింది. అదే సమయంలో మానవ వనరులశాఖ 55,000 కోట్ల రుపాయలు ప్రతి సంవత్సరము అవసరమౌతాయని అంచనావేసింది.
    జాతీయ ప్రణాళికా సంఘం మూల ధనాన్ని భరించుటకు వ్యతిరేకతను వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు మూలధనంలో కొంత భాగం కూడా భరించడానికి సిద్ధంగా లేమని చెప్పాయి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం. ఇక తప్పని సరై ఈ బిల్లుని మొత్తం తొక్కపెట్టడానికి సిద్ధపడింది.
    “పాఠశాల” అనే పదం మౌలిక భవన సదుపాయములతో కూడిన దైనప్పటికీ, ఈ బిల్లు ముసాయిదా ప్రతి ఆవాస ప్రాంతంలో మూడు సంవత్సరములలో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు లక్ష్యంగా పెట్టుకుంది.
    దూరప్రాంతాలైన పల్లెలు మరియు నగర పేదవాడలలో పాఠశాల స్థాపనకు మామూలుగా అవసరమైన పరిపాలనా విధాన మంజూరు వంటి అవరోధములు లేకుండా కొన్ని కనీస ప్రమాణములు తయారు చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక అంశాలతో ముడిపడిన కారణాలతో పిల్లలు స్కూలుకు పోకుండా చేసే విషయాలను పరిష్కరించడానికి సహాయ సహకారాలను అందిస్తానని అంగీకరించాయి.
    చట్టాలు, బిల్లులు పిల్లలను స్కూలుకు వెళ్ళేటట్లు చేయలేవు. ప్రారంభంలో కొన్ని అవరోధములున్నప్పటికి, ఈ పథకము ప్రయోజనం సరైన పిల్లలకి చేరాలా ప్రతివాళ్ళు సాంఘిక బాధ్యతను తీసుకోవల్సిఉంటుంది. ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని వాళ్ళు చెపుతున్నారు, కానీ ఇతరుల మీద ఆ ఫీజు భారం వేయుట భావ్యం కాదని క్రొత్త ఢిల్లీ, బరఖాంబ రోడ్ లో ఉన్న మోడర్న్ స్కూలు ప్రధానోపాధ్యాయులు, లతా వైద్యనాధన్ అన్నారు.
    సామాజిక బాధ్యత పంచుకోవడాన్ని ఒక ప్రత్యేక అధికారముతో కూడిన గౌరవంగా భావించాలి తప్ప భారంగా భావించరాదని, ఈ బిల్లు రావడానికి మూలకారకులైన విద్యావేత్తలు అటున్నారు.

    విద్యా హక్కు పరిరక్షణకై దిశా నిర్దేశన

    ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలోని అంశాలను పర్యవేక్షించడం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ – ఎన్ . సి. పీ. సీ. ఆర్.) యొక్క బాధ్యతగా పేర్కొన బడింది . ఈ చట్టం మాటల్లోనూ, చేతల్లోనూ సమర్ధవంతంగా అమలు జరిగేటట్లు ఎన్ . సి. పీ. సీ. ఆర్. కమిషన్ వివిధ సంస్థలకు, ప్రభుత్వ శాఖలకు, పౌర సంఘాలకూ, మరియు ఇతర సంబంధిత సంస్థలకూ ఏకాభిప్రాయం కుదర్చడం లో చొరవ చూపించింది. విద్యా హక్కును సక్రమంగా అమలు చేయడానికి తగిన దిశా నిర్దేశన కొరకు వివిధ ప్రభుత్వ అధికారులతోనూ, విద్యా రంగంలో మిక్కిలి ప్రతిభ మరియు అనుభవం కలిగిన వ్యక్తులతోనూ కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
    ఈ కమిటీ ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సమావేశాలలో ఆర్. టి. ఇ. యాక్ట్ ను సక్రమంగా అమలు జరిపించేందుకు ఒక ప్రణాళికను రూపొందించింది. ఆర్. టి. ఇ. పై దృష్టి కేంద్రీకరించడానికి ఎన్ . సి. పీ. సీ. ఆర్. లోనే ప్రత్యేకించి ఒక విభాగాన్ని నెలకొల్పడం దీనిలోని భాగము. ఈ విభాగాన్ని ఇద్దరు కమిషనర్లు, ఇతర సిబ్బంది సహాయంతో నిర్వహిస్తారు. ఈ విభాగం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (మినిస్ట్రీ ఆఫ్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ – ఎమ్. హెచ్. ఆర్. డి.) తో సంబంధం ఏర్పరచుకుని సహాయం పొందుతుంది.
    ఆర్. టి. ఇ. యాక్ట్ ను జయప్రదంగా అమలు జరప డానికి ఈ విభాగం ఎమ్ . హెచ్. ఆర్. డి. తో కలిసి పనిచేసే వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉంది.
    ఎన్ . సి. పీ. సీ. ఆర్ . తరఫున పని చేయడానికి వివిధ రాష్ట్రాలలో ప్రతినిధులను నియమించడం మూడో విధానం గా సూచించబడింది. విద్యా రంగం లో నిష్ణాతులైన ఈ ప్రతినిధులు వారి వారి రాష్ట్రాలలో ఈ హక్కు అమలౌతున్న పరిస్థితిపై ఎన్ . సి. పీ. సీ. ఆర్. కు సమచారాన్ని తెలియచేస్తారు. పలు రాష్ట్రాల నుండి వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తారు.
    మరింత సమన్వయం సాధించడం కొరకు ఆర్. టి. ఇ. యాక్ట్ కు సంబంధించిన ఇతర మంత్రిత్వ శాఖల (సామాజిక న్యాయం మరియు సాధికారత, శ్రామిక, గిరిజన వ్యవహారాలు, పంచాయతి రాజ్ లోని అధికారులతో సమావేశాలు ఏర్పరచడమైనది. ఉదాహరణకి, ఆర్. టి. ఇ. యాక్ట్ బాల కార్మిక చట్టం తో ముడిపడి ఉండడం వలన కార్మిక మంత్రిత్వశాఖ యొక్క జోక్యం అవసరం. అలాగే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే పాఠశాలలు కూడా ఆర్. టి. ఇ. యాక్ట్ పరిధిలోనికే వస్తాయి. అందువలన ఎన్. సి. పీ. సీ. ఆర్. మరియు ఈ మంత్రిత్వ శాఖల మధ్య మంచి సమన్వయం, అవగాహన ఉంటే పిల్లలు ఆర. టి. ఇ. యాక్ట్ వలన లాభం పొందగలరు.
    ఆర. టి. ఇ. యాక్ట్ ను సమర్ధవంతంగా పర్యవేక్షించడానికి, పరస్పర సంబంధాలను చర్చించేందుకు ఎన్. సి. పీ. సీ. ఆర్. ఇతర జాతీయ కమిషన్ల (జాతీయ మహిళా కమిషన్, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ ) ప్రతినిధులతో సమావేశమైంది. ఉదాహరణకి, బాలికలు, వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలు విద్యా హక్కు ను కోల్పోకుండా ఉండేందుకు ఈ కమిషన్లు కలిసి కృషి చేయ వచ్చు. అంతే కాక ఎన్ . సి. పీ. సీ. ఆర్. బహిరంగ విచారణ నిర్వహించినప్పుడు తత్సంబంధిత కమిషన్ నుండి ఒక ప్రతినిధి జూరీలో ఉంటే మరింత బలం చేకూరుతుందని కూడా సూచించబడింది.
    ఈ యాక్ట్ లోని వివిధ అంశాలను మరియు దాని పర్యవేక్షణ గురించి చర్చించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలోని విద్యావేత్తలతో సంప్రదింపులు జరిపింది. ఇరవై రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రతినిధులను నియమించడానికి పౌర సంఘాలతో ఎన్. సి. పీ. సీ. ఆర్. జరిపిన సమావేశాల పరంపరలో ఇది మొదటిది.
    అయినప్పటికీ ఈ యాక్ట్ ను మరింత మెరుగ్గా అమలు పరచి, పరిరక్షించేందుకు, దానిలోని అంశాలను దేశంలోని అన్ని సంస్థలూ అర్ధం చేసుకొని అనుసరించే విధంగా మరింత అవగాహనను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు గాను ఒక విస్తృతమైన ప్రచార కార్య క్రమాన్ని చేపట్టవలసి ఉంది. ఇందులో భాగంగా ఈ యాక్ట్ ను ఎమ్. హెచ్. ఆర్. డి. మరియు ఇతర సంస్థలు కలిసి వివిధ భాషలలోనికి అనువదించాలి. ఈ ప్రచారానికి పనికి వచ్చే విధంగా ఈ యాక్ట్ లోని మౌలికమైన అంశాలను మరియు హక్కులను వివరిస్తూ సులభ శైలిలో రాసిన చట్టాన్ని, పోస్టర్లను, ప్రాధమిక వాచకాలను, కర పత్రాలను రూపొందించి ఈ ప్రక్రియకు ఎన్. సి. పీ. సీ. ఆర్. నాంది పలికింది. పిల్లలు కూడా ఈ యాక్ట్ ను అర్ధం చేసుకునేలా వారి కొరకు ప్రత్యేక బోధనా సామగ్రిని కూడా సంస్థ రూపొందిస్తుంది.

    తాజా వార్తలు

    'చిన్నారులకు ప్రవేశ పరీక్షలొద్దు'

    న్యూఢిల్లీ: నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ఒకటో తరగతి, అంతకన్నా ముందు (ప్రీప్రైమరీ) తరగతుల్లో జరిపే ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవవనరులశాఖ కొత్త మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి పరీక్షలు జరపకుండానే ప్రవేశం కల్పించాలని స్పష్టం చేసింది. విద్యాహక్కుచట్టం ప్రకారం అన్ని అన్‌ఎయిడెడ్‌, ప్రత్యేక విభాగపు పాఠశాలల్లో కనీసం 25 శాతం సీట్లను సమీప ప్రాంతాల్లోని నిరుపేద, బలహీనవర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించాలి. ప్రాథమికవిద్య పూర్తయ్యేంతవరకూ చదువు చెప్పాలి. దీనికి సంబంధించి అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో కేంద్రం తాజా మార్గదర్శకాలను వెలువరించింది. మిగిలిన 75% సీట్లకు సంబంధించి సహేతుకమైన విధానాన్ని అనుసరించాలని, తల్లిదండ్రుల విద్యార్హతల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని లెక్కించే పద్ధతి మానుకోవాలని, ప్రవేశ ప్రక్రియ వివరాలను బహిరంగంగా అందరికీ వెల్లడించాలని కేంద్రం తెలిపింది.

    విద్యా హక్కు చట్టం అమలుపై కార్యాచరణ ప్రణాళిక

    ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం
    ఒకటి నుంచి 8వ తరగతి దాకా పంపిణీ
    విద్యా హక్కు చట్టం అమలుపై కార్యాచరణ ప్రణాళిక
    రాష్ట్రాల విద్యా కార్యదర్శుల భేటీలో చర్చ
    న్యూఢిల్లీ: విద్యా హక్కు చట్టాన్ని అమలుచేయడానికి కేంద్రం తయారుచేసిన కార్యాచరణ ప్రణాళిక(రోడ్‌మ్యాప్‌)ను రాష్ట్రాలు ఆమోదించినట్లయితే.. దేశంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేస్తారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల విద్యా కార్యదర్శుల సమావేశంలో ఈ రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాని స్వరూపం స్థూలంగా ఇదీ...
    • దేశంలో అదనపు తరగతి గదుల నిర్మాణం-7.8 లక్షలు
    • బాలికల మరుగుదొడ్ల నిర్మాణం-7 లక్షలు
    • వచ్చే ఐదేళ్లలో కేంద్రం చేసే ఖర్చు-రూ.1.71 లక్షల కోట్లు
    • ప్రతి విద్యార్థికీ ఏటా యూనిఫాంపై చేసే ఖర్చు - రూ.400 (యూనిఫాంలను రాష్ట్రాలే అందజేయాలి)
    • పాఠ్యపుస్తకాల పంపిణీ- ఉచితంగానే
    • ప్రత్యేక శ్రద్ధ అవసరమైన విద్యార్థిపై ఏటా చేసే ఖర్చు-రూ.3వేలు
    • తీవ్ర అంగవైక్యలం ఉన్న విద్యార్థులకు ఇంట్లోనే చదువు నేర్పించడానికి చేసే ఖర్చు - రూ.10వేలు
    • ప్రతి 30 మంది విద్యార్థులకు ఓ ఉపాధ్యాయుడు ఉండాలంటే అదనంగా అవసరమైన టీచర్లు - 5.1 లక్షలు
    • మొత్తం కేటాయింపుల్లో ఉపాధ్యాయుల వేతనాలపై చేసే ఖర్చు-28 శాతం
    • పౌర సంబంధ పనులపై చేసే ఖర్చు- 24 శాతం
    • బడిలో చేరిన విద్యార్థులపై చేసే వ్యయం- 17 శాతం
    • పాఠశాల వెలుపల ఉండే విద్యార్థులకు శిక్షణపై వ్యయం - 9 శాతం
    • పాఠశాల సౌకర్యాలపై చేసే ఖర్చు- 8 శాతం
    • అందరికీ సమానంగా విద్యావకాశాలు కల్పించడానికి ఖర్చు - 6 శాతం
    • వచ్చే ఐదేళ్లలో శిక్షణ పొందే ఉపాధ్యాయులు - 7.6 లక్షలు
    • ఒక్కో తరగతి గదికి ఒక్కో టీచరుండాలి
    • నీటిసౌకర్యం కల్పించాల్సిన పాఠశాలలు-3.4 లక్షలు
    ఆధారము: ఈనాడు.

    విద్యాహక్కు నియమావళి

    సర్కారీ సీట్లు లేకుంటేనే ప్రైవేటు విద్య
    నేరుగా చేరితే విద్యాహక్కు వర్తించదు
    చట్టం అమల్లో రాష్ట్రం మెలిక
    నియమావళిని విడుదల చేసిన విద్యాశాఖ
    28లోగా అభిప్రాయాలు తెలపాలని ప్రజలకు సూచన
    హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయిన తర్వాత వచ్చే విద్యార్థులకుమాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో 25% రిజర్వేషన్లను అమలుజేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. తల్లిదండ్రులు తమ పిల్లలను నేరుగా ప్రైవేటు పాఠశాలల్లో చేరిస్తే వారికి విద్యాహక్కు చట్టం వర్తించదని స్పష్టం చేసింది. అలా చేరిన వారికి ప్రభుత్వం బోధనా ఫీజును చెల్లించదని పేర్కొంది. చట్టాన్ని అనుసరించి ప్రైవేటు పాఠశాలల్లో చేరిన ఒక్కో విద్యార్థికి రూ.550 ఖర్చవుతుందని అధికారులు అంచనా వేసిన సంగతి తెలిసిందే. చట్టం అమలుకు ప్రత్యేక కమిటీ రూపొందించిననియమాలను ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రులు అహ్మదుల్లా, మాణిక్యవరప్రసాదరావు సోమవారం ఇక్కడ వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు ముగిసి, తరగతులు ప్రారంభమైన ప్రస్తుతపరిస్థితుల్లో నియమావళిని విడుదల చేయడంపై విలేకర్లు మంత్రులను ప్రశ్నించారు. తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వారు బదులిచ్చారు. ప్రైవేటు పాఠశాలల్లో 25% రిజర్వేషన్‌ విధానాన్ని అమలుచేస్తే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రాజెక్టు సంచాలకులు మహమ్మద్‌ అలీ రఫత్‌ చెప్పారు.
    ఇవీ నియమాలు
    • ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, ప్రత్యేక కేటగిరీ పాఠశాలలు ఒకటో తరగతిలో 25% సీట్లను పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలతో భర్తీ చేయాలి. అందుకయ్యే ఖర్చును నిబంధనలకు లోబడి ప్రభుత్వమే చెల్లిస్తుంది
    • అనాధలు, హెచ్‌ఐవీ బాధితులు, వికలాంగులకు ఐదు శాతం; ఎస్సీలకు 10, ఎస్‌టీలకు 4, వార్షికాదాయం రూ.60 వేలు లోపున్న బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు ఆరు శాతం సీట్లను కేటాయించారు
    • ప్రభుత్వం గుర్తింపు లేకుండా ఎవరూ పాఠశాలను ఏర్పాటు చేయకూడదు
    • ఇప్పటికే నడుస్తున్న పాఠశాలల్లో నిర్దేశించిన సౌకర్యాలు లేకుంటే చట్టం అమల్లోకి వచ్చిన మూడేళ్ల లోపు వాటిని సొంత ఖర్చులతో ఏర్పాటు చేయాలి. లేకుంటే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తారు
    • ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు తప్పించి మిగిలిన అన్ని పాఠశాలలుస్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి గ్రామ సర్పంచి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు
    • యాజమాన్య సంఘం సంబంధిత పాఠశాల పనితీరును సమీక్షించడం, అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన తదితర విధులు నిర్వర్తిస్తుంది
    • ఉపాధ్యాయుల ఫిర్యాదుల పరిష్కారానికి మండల, జిల్లా స్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేస్తారు
    • సెప్టెంబరు చివరినాటికి అన్ని పాఠశాలలు ప్రాథమిక స్థాయిలో 1:30, ప్రాథమికోన్నతస్థాయిలో 1:35 వంతున ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని అమలుచేయాలి
    • ఉపాధ్యాయుల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి
    • ఎనిమిదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక విద్య పూర్తయినట్లు ధ్రువీకరణపత్రం ఇవ్వాలి
    • బాలల విద్యా హక్కుల పరిరక్షణకుగాను విద్యాహక్కు సంరక్షణ సంస్థను సెప్టెంబరులో ఏర్పాటుచేయాలి
    • చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సలహాలు ఇచ్చేందుకు ఓ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి
    పై నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను ఈనెల 28 లోగా apssahyd@yahoo.co.in వెబ్‌సైట్‌ లేదా Fax :04023299089ద్వారా తెలియజేయవచ్చు. అధికారి, రాజీవ్‌ విద్యామిషన్‌ రాష్ట్ర ప్రాజెక్ట్‌ కార్యాలయం, ఎస్‌ఐఎంఏటీ బిల్డింగ్‌, ఎస్‌సీఈఆర్‌టీ క్యాంపస్‌, ఎల్బీ స్టేడియం ఎదురుగా, హైదరాబాద్‌-500 001 చిరునామాకు రాతపూర్వకంగా కూడా పంపొచ్చు.

    విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలలో ప్రవేశాలు (అడ్మిషన్లు)

    దేశమంతటా, పాఠశాలలలో ప్రవేశాలకు (అడ్మిషన్లకు) సంబంధించిన విధానాలు, బాలల నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం -2009 ( ఆర్ టి ఇ ) నిబంధనలకు అనుగుణంగా వుండేలా చూడడానికి బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ( ఎన్ సి పి సి ఆర్ ) అనేక రకాల చర్యలను తీసుకుంటున్నది. మాధ్యమిక స్ధాయి విద్యలో ప్రవేశాల విషయంలో ఎలాంటి వడబోత ( స్క్రీనింగ్ ) వుండకూడదని విద్యాహక్కు చట్టం నిర్దేశిస్తున్నప్పటికి, కొన్ని రాష్ట్రాలలో పాఠశాలలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుండడంతో, ఎన్ సి పి సి ఆర్ ఇలాంటి చర్యలు చేపట్టవలసిన అవసరం ఏర్పడింది.
    పాఠశాలలలో సంబంధించిన విధానాలు, విద్యా హక్కు చట్టానికి లోబడి వుండేవిధంగా చూడడంకోసం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఎన్‌ సి పి సి ఆర్ ఏప్రిల్ లో అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు (ఛీఫ్ సెక్రటరీలకు) లేఖలు వ్రాసింది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ---జి ఎన్ సి టి డి) విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం (డైరెక్టరేట్) నిర్వహణలోని రాజకీయ ప్రతిభా వికాస్ విద్యాలయాలలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ, ఆ సంచాలకుల కార్యాలయం మార్చిలో జారీ చేసిన ఒక ప్రకటన ఎన్‌ సి పి సి ఆర్ ఇలా లేఖలు వ్రాయడానికి కారణమైంది.
    జి ఎన్ సి టి డి విద్యా శాఖ సంచాలకుల కార్యాలయం, అన్ని ప్రముఖ వార్తా పత్రికలలోను, సంచాలకుల కార్యాలయ వెబ్ సైట్ లోను జారీచేసిన ఆ ప్రకటన, తమ పాఠశాలలలో ఆరవ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు ఒక్కొక్క దరఖాస్తు ఫారాన్ని ` 25 వంతున కొని, దరఖాస్తు చేసుకోవాలని; ఆ తరువాత ప్రవేశ పరీక్ష వ్రాయాలని నిర్దేశిస్తున్నది. అయితే, ఏ రకమైన ఎంపిక పరీక్ష పద్ధతి ( స్క్రీనింగ్ ) వుండకూడదని , కేవలం అప్పటి పరిస్థితికి అనువైన రీతిలో యాదృచ్ఛికంగా( రాండమ్) మాత్రమే విద్యార్థుల ఎంపిక జరపాలని ఆర్ టి ఇ చట్టం నిర్దేశిస్తుండడంతో, సంచాలకుల కార్యాలయం జారీచేసిన ప్రకటన, ఆర్ టి ఇ చట్టాన్ని కచ్చితంగా ఉల్లంఘించడమే అవుతుంది.
    ఆర్ టి ఇ చట్టం అమలును పర్యవేక్షించే కేంద్రీయ సంస్థ అయిన ఎన్ సి పి సి ఆర్, ఆ ప్రకటనను వెనుకకు తీసుకోవలసిందిగా, దానికి బదులుగా, విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణమైన రీతిలో ప్రకటనను జారీచేయవలసిందిగా కోరుతూ, జి ఎన్ సి టి డి , విద్యా విభాగం ముఖ్య కార్యదర్శికి లేఖ వ్రాసింది. జి ఎన్ సి టి డి నిర్వహణలోని మిగతా అన్ని పాఠశాలలుకూడా, ఆర్ టి ఇ చట్టం అమలులో తాము అనుసరిస్తున్న పద్ధతులను తగినరీతిలో సవరించుకోవడానికి వీలుగా, ఆ చట్టం నిబంధనలను వివరిస్తూ వారంలోగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ఆ లేఖలో కోరడం జరిగింది.
    అయితే, ఎన్ సి పి సి ఆర్ సూచనను పాటించడానికి జి ఎన్ సి టి డి సంచాలకుల కార్యాలయం నిరాకరించడంతో, కమిషన్ తాఖీదు పంపి సంచాలకుల కార్యాలయం అధికారులను పిలిపించుకుని, పాఠశాలలలో ప్రవేశాలను ఆర్ టి ఇ చట్టం నిబంధనలకు అనుగుణంగా తిరిగి జరపవలసిందేనని నిర్దేశించి, జులై వరకు గడువు ఇచ్చింది. ఇతర రాష్ట్రాలలో కూడా ఆర్ టి ఇ చట్టం ఈ రకమైన ఉల్లంఘనలకు గురికాకుండా చూడడంకోసం, చట్ట నిబంధనలను వివరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు కమిషన్ లేఖలు వ్రాసింది. పాఠశాలలకు జారీచేసే ప్రభుత్వ ఉత్తర్వులలో ఈ క్రింది అంశాలను స్పష్టంగా పేర్కొనాలని కమిషన్ నిర్దేశించింది:
    1. ఆర్ టి ఇ చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రవేశాల పద్ధతులను రూపొందించుకోవాలి
    2. నిర్దిష్ట వర్గీకరణ " ( స్పెసిఫైడ్ క్యాటగిరి ) కి సంబంధించిన అన్ని పాఠశాలలలోను, ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలలోను బలహీన వర్గాల విద్యార్థులకు 25 % సీట్లు తప్పనిసరిగా కేటాయించాలి ; ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు అవి అనుసరించవలసిన ప్రత్యేకింపు (రిజర్వేషన్) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
    ఇంతేకాకుండా, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలను కూడా కనిపెట్టి, విద్యా హక్కు చట్టం నిబంధనలను గురించి, వాటి పరిసరాలలోని విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునే విషయంలో అనుసరించవలసిన విధానాలను గురించి వాటికి నోటీసులు జారీ చేయాలనికూడా కమిషన్ నిర్దేశించింది. విద్యా హక్కు చట్టం పై రాష్ట్రాల నిబంధనల ఖరారు త్వరలో పూర్తికావాలని కూడా కమిషన్ పేర్కొన్నది.
    ఆర్ టి ఇ చట్టంలో, " నిర్దిష్ట వర్గీకరణ " ( స్పెసిఫైడ్ క్యాటగిరి ) కి సంబంధించిన పాఠశాలలుగా పేర్కొన్న నవోదయ పాఠశాలల విషయంలో ఏ విధానాన్ని అనుసరించాలన్న ప్రశ్నకు సమాధానంగా, ఆర్ టి ఇ చట్టంలోని 13 వ విభాగం (సెక్షన్‌) లో పొందుపరచిన నిబంధనలు ఎలాంటి మినహాయింపులేకుండా అన్ని పాఠశాలలకు వర్తిస్తాయని కమిషన్ స్పష్టీకరించింది.
    విద్యా హక్కు చట్టం 13వ విభాగం (సెక్షన్‌) లోని సంబంధిత అంశాలు :
    " పిల్లలను పాఠశాలలో చేర్చుకునే సమయంలో ఏ పాఠశాల అయినా లేదా ఏ వ్యక్తి అయినా ఏ రకమైన తలసరి రుసుం (క్యాపిటేషన్ ఫీజు) వసూలుచేయకూడదు. ఆ పిల్లలకు లేదా వారి తలిదండ్రులకు లేదా సంరక్షకులకు ఎలాంటి ఎంపిక పరీక్ష ( స్క్రీనింగ్ ) పెట్టకూడదు "
    • సబ్ సెక్షన్-1 లోని ఈ నిబంధనను ఉల్లంఘించి ఏదైనా పాఠశాల లేదా వ్యక్తి తలసరి రుసుం వసూలుచేస్తే,
    ఎ ) వారికి ఆ తలసరి రుసుం కు పదిరెట్లు జరిమానా శిక్షగా విధించబడుతుంది.
    బి ) పాఠశాలలో చేరగోరె పిల్లలను ఏదైనా ఎంపిక పరీక్షకు గురిచేస్తే, ఆ విధంగా మొదటిసారి నిబంధన ఉల్లంఘించినందుకు ` 25, 000, ఆ తర్వాత ప్రతి ఉల్లంఘనకు ` 50, 000 వంతున జరిమానా శిక్షగా విధించబడుతుంది.
    ఆధారము: NCPCR

    నవోదయ పాఠశాలలలో ప్రవేశానికి ఎలాంటి ఎంపిక పరీక్ష వుండకూడదు

    ప్రాథమిక విద్యా తరగతులలో ( 1 వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ) చేరగోరె బాలలకు ఎలాంటి ఎంపిక పరీక్ష నిర్వహించకూడదని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ( ఎన్ సి పి సి ఆర్ ) నవోదయ పాఠశాలల కమిషనర్‌కు, రాష్ట్రాల విద్యా శాఖ కార్యదర్శులకు లేఖలు వ్రాసింది. ఢిల్లీలోను, కొన్ని ఇతర రాష్ట్రాలలోను నవోదయ పాఠశాలలు విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయంటూ ఫిర్యాదులు అందడంతో, ఆర్ టి ఇ నిబంధనల ఉల్లంఘన జరిగిందేమో నిర్ధారించుకోవడానికి ఎన్ సి పి సి ఆర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నది.
    ఆర్ టి ఇ చట్టం 13 వ విభాగంలోని నిబంధనలను పేర్కొంటూ, పిల్లలను పాఠశాలలో చేర్చుకునే సమయంలో ఏ పాఠశాల అయినా లేదా ఏ వ్యక్తి అయినా ఏ రకమైన తలసరి రుసుంను వసూలుచేయడాన్ని, ఆ పిల్లలకు లేదా వారి తలిదండ్రులకు లేదా సంరక్షకులకు ఎలాంటి ఎంపిక పరీక్ష ( స్క్రీనింగ్ ) పెట్టడాన్ని చట్టం నిషేధించిన విషయాన్ని ఎన్ సి పి సి ఆర్ ఎత్తిచూపింది. ఏదైనా పాఠశాల లేదా వ్యక్తి తలసరి రుసుం వసూలుచేస్తే, వారు ఆ తలసరి రుసుం కు పదిరెట్లు జరిమానాతో శిక్షించబడతారని కూడా ఎన్ సి పి సి ఆర్ స్పష్టంచేసింది.
    పాఠశాలలో చేరగోరె పిల్లలను ఏదైనా ఎంపిక పరీక్షకు గురిచేస్తే, ఆ విధంగా మొదటిసారి నిబంధన ఉల్లంఘించినందుకు ` 25, 000, ఆ తర్వాత ప్రతి ఉల్లంఘనకు ` 50, 000 వంతున జరిమానా విధింపబడుతుంది.
    ఆర్ టి ఇ చట్టంలో ప్రత్యేక వర్గీకరణ పాఠశాలలుగా పేర్కొనబడిన నవోదయ పాఠశాలలతో సహా, అన్ని పాఠశాలలకు 13 వ విభాగం వర్తిస్తుందని, నవోదయ పాఠశాలలు నిర్వహించే ఎంపిక పరీక్షలు ఆర్ టి ఇ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కూడ ఎన్ సి పి సి ఆర్ స్పష్టంచేసింది. పాఠశాలలు తాము అనుసరిస్తున్న పద్ధతులను, నిబంధనలను వారంలోగా తగిన విధంగా మార్చుకునేలా, చట్టంలోని నిబంధనలను వివరిస్తూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీచేయాలని ఎన్ సి పి సి ఆర్ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
    ఆధారము: NCPCR

    విద్యా హక్కు బాధ్యత రాజీవ్‌ విద్యా మిషన్‌కు అదనంగా రూ.665 కోట్ల నిధులు 20వేల మంది టీచర్ల సర్దుబాటు? 70 లక్షల మంది విద్యార్థులకు దుస్తులు

    హైదరాబాద్‌, న్యూస్‌టుడే: విద్యా హక్కు చట్టం పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌ విద్యా మిషన్‌కు అప్పగించింది. ఇందుకోసం దాని కార్యకలాపాల గడువును మరో రెండేళ్లు పొడిగించింది. వాస్తవానికి ప్రాథమిక విద్య బలోపేతానికి 2001-02లో ప్రారంభమైన రాజీవ్‌ విద్యా మిషన్‌ గడువు 2010తో ముగియాల్సి ఉంది. విద్యా హక్కు చట్టం అమలు కోసం ఇప్పుడు రెండేళ్ల పొడిగింపు లభించింది. ఆ తర్వాతా పొడిగింపు లభించే అవకాశముంది. ఎందుకంటే 2015 వరకూ విద్యా హక్కు చట్ట పర్యవేక్షణ బాధ్యతను రాజీవ్‌ విద్యా మిషన్‌ చూడాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్‌ తెలిపారు.
    రాజీవ్‌ విద్యా మిషన్‌కు 2010-11 ఆర్థిక సంవత్సరానికి రూ.1100 కోట్లను కేటాయించారు. తాజాగా విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి మరో రూ.660 కోట్లు కేంద్రం నుంచి పొందాలని ప్రాథమిక విద్యాశాఖ ప్రతిపాదనలను రూపొందించింది.
    విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు, ఉచితంగా రెండు జతలదుస్తుల పంపిణీ వంటి చర్యలకు సంబంధించిన దస్త్రాల పరిశీలనలో ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వంతున సర్దుబాటు చేయాలి. దీని ప్రకారం సుమారు 20వేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇవి ప్రాథమిక విద్యాశాఖ నుంచి మాథ్యమిక విద్యాశాఖ అధికారులకు అందాయి. ఈ చర్యలకు ఉపక్రమించే ముందు న్యాయపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై త్వరలో మంత్రి సమీక్షించనున్నారు.
    జనవరిలో ఉచిత దుస్తులు: మరోవైపు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు (సుమారు 70లక్షల మంది) రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నారు. జతకు రూ.200 వంతున వ్యయం చేయనున్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారా వీటిని కొనుగోలు చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాది జనవరి నుంచి విద్యార్థులకు రెండు జతల దుస్తులను అందజేస్తామని చందనాఖన్‌ 'న్యూస్‌టుడే'కు చెప్పారు.
    ముఖ్యమంత్రి కార్యాలయానికి కీలక దస్త్రాలు: బాలల హక్కులను పర్యవేక్షించేందుకు 'రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ'ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అధికారులు పంపారు. అథారిటీ బాధ్యతలను హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన విద్యావేత్తకు అప్పగించాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రభుత్వపరంగా ఇందుకు సంబంధించిన నియామకం జరగనుంది. మరోవైపు ఈ చట్టం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన ముసాయిదాను అనుసరించి అధికారులు తయారుచేసిన నిబంధనల దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లింది.
    ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు








    జాతీయ మానవ హక్కుల కమీషన్



      


    జాతీయ మానవ హక్కుల కమీషన్ చట్టబద్దమైన, స్వయం ప్రతిపత్తి సంస్థ, కాని రాజ్యాంగబధ్ధమైన సంస్థ కాదు. "మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993" ప్రకారం జాతీయ మానవ హక్కుల కమీషన్ అక్టోబర్ 12 , 1993 న ఏర్పడింది. కాంగ్రేస్ పార్టీ అధికారంలో పి.వి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కమీషన్ ను ఏర్పాటు చేశారు. 1993  మానవ హక్కుల చట్టాన్ని 2006 సంవత్సరంలో సవరించి ఈ  కమీషన్ లో కోన్ని మార్పులు చేశారు.
    • దీన్ని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
    • జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఒక చైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు.
    సభ్యులకు ఉండవలసిన అర్హతలు: 
    • చైర్మన్ గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి.
    • ఒక సభ్యుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
    • మరోక సభ్యుడు ఏదైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
    • మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్న వారై ఉండాలి











     UPLOAD అవుతుంది.......

    Tuesday, August 11, 2015

    అటల్ బిహార్ వాజ్ పేయి భారతరత్న






    • లోకమాన్య తిలక్ అవార్డు,గోవింద్ వల్లభ పంత్ అవార్డు, పధ్మవిభూషన్, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు పోందారు.
    • ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారత ప్రధాని
    • అవిశ్వాస తీర్మానం ద్వారా ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని లోల్పోయిన ఏకైఅక ప్రధాని
    • "జై జవాన్ , జైకిసాన్, జై విజ్ఞాన్ " నినాదం

     1926 డిసెంబరు 25న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా సమీప గ్రామం బదేశ్వర్‌లో జన్మించారు. తండ్రి సంస్కృత పండితుడు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. భారతీయ సంస్కృతి పునర్వికాసం కోసం తపించే వాజ్ పేయి.. అర్.ఎస్.ఎస్లో చేరారు. అప్పట్లో క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం అర్.ఎస్.ఎస్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేశారు. 1951లోజన్‌సంఘ్‌ లో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1953లో 31 ఏళ్ల వయస్సులోనే తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1968లో జన సంఘ్ అధ్యక్షుడయ్యారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో జన్‌సంఘ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారు. ఇందిర సర్కారు ఆగడాలపై గళమెత్తారు. 1977లో మొరార్జీదేశాయ్‌ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. జనతా ప్రభుత్వం పతనం తర్వాత అద్వానీతో కలసి 1980లో బీజేపీకి ప్రాణం పోశారు. 1984లో కేవలం 2 స్థానాలతో పార్లమెంట్ లో ఉన్న బీజేపీ.. 1996లో మైనారిటీ సర్కారు ప్రధాని ప్రమాణస్వీకారం చేసే స్థాయికి పార్టీని తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. 1998 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి రెండోసారి ప్రధాని అయ్యారు. జయలలిత రాజకీయంతో ఈసారి 13 నెలలకే అధికారం కోల్పోయారు వాజ్ పేయి. 1999 ఎన్నికల్లో మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టి... ఇందిరాగాంధీ తర్వాత ప్రధానిగా మూడుసార్లు ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.  సంకీర్ణ ప్రభుత్వాన్ని వాజ్ పేయి విజయవంతంగా నడిపించారు. నవభారత నిర్మాణానికి పునాదులు వేశారు. టెలికామ్‌, పౌరవిమానయాన రంగం, బ్యాంకింగ్‌, బీమా, ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ వాణిజ్యం-పెట్టుబడులు, పన్నులు, విద్యుత్‌, పెట్రోల్‌ ధరలు వంటి.. అనేక అంశాల్లో సంస్కరణలు అమలు చేశారు. వృద్ధిరేటు 8 శాతానికి తీసుకెళ్లారు. 1998 లో అణు పరీక్షలు చేపట్టి.. భారత్ సత్తా చాటారు. వాజ్‌పేయి మంచి ప్రధాని, సంకీర్ణ నేత మాత్రమే కాదు.. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌. ఆయన్ను వరించి వచ్చిన పురస్కారాలెన్నో.. గోవింద్‌ వల్లభ్‌పంత్‌ అవార్డును కూడా అటల్  అందుకున్నారు అటల్‌జీ. 1992లో పద్మవిభూషణ్‌, 1993లో గౌరవ డాక్టరేట్‌, 1994లో లోకమాన్య తిలక్‌ పురస్కారం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. జీవిత చరమాంకంలో భారత రత్నతో ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.




    నిర్వహించిన పదవులు

    • 1951 – వ్యవస్థాపక సభ్యుడు, భారతీయ జనసంఘ్
    • 1957 – రెండవ లోక్‌సభకు ఎన్నిక
    • 1957–77 – నాయకుడు, భారతీయ జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ
    • 1962 – సభ్యుడు, రాజ్యసభ
    • 1966-67- ఛైర్మన్, ప్రభుత్వ అస్సూరెన్స్ కమిటీ
    • 1967 – నాలుగవ లోక్‌సభకు మరలా ఎన్నిక (రెండవ సారి)
    • 1967–70 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
    • 1968–73 – అధ్యక్షుడు, భారతీయ జనసంఘ్
    • 1971 – ఐదవ లోక్‌సభకు ఎన్నిక. (మూడవ సారి)
    • 1977 – ఆరవ లోక్‌సభకు ఎన్నిక (నాలుగవ సారి)
    • 1977–79 – కేంద్ర కేబినెట్ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ
    • 1977–80 – వ్యవస్థాపక సభ్యుడు, జనతాపార్టీ
    • 1980 – ఏడవ లోక్‌సభకు ఎన్నిక ( ఐదవ సారి)
    • 1980-86- అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ (బి.జె.పి)
    • 1980-84, 1986 మరియు 1993–96 – నాయకుడు, బి.జె.పి. పార్లమెంటరీ పార్టీ
    • 1986 – సభ్యుడు, రాజ్యసభ; సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ
    • 1988–90 – సభ్యుడు, హౌస్ కమిటీ; సభ్యుడు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ.
    • 1990-91- ఛైర్మన్, కమిటీ ఆన్ పిటీషన్స్.
    • 1991– పదవ లోకసభకు ఎన్నిక (ఆరవ సారి)
    • 1991–93 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ.
    • 1993–96 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్; ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
    • 1996 – 11వ లోక్‌సభకు ఎన్నిక (ఏడవ సారి).
    • 16 మే 1996 – 31 మే 1996 – భారతదేశ ప్రధానమంత్రి.
    • 1996–97 – ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
    • 1997–98 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్.
    • 1998 – 12వ లోకసభకు ఎన్నిక (ఎనిమిదవ సారి).
    • 1998–99 – భారతదేశ ప్రధానమంత్రి; విదేశీ వ్యవహారాలమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
    • 1999 – 13వ లోక్‌సభకు ఎన్నిక (తొమ్మిదవ సారి)
    • 13 అక్టోబరు 1999 నుండి 13 మే 2004– భారతదేశ ప్రధానమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
    • 2004 – 14వ లోక్‌సభకు ఎన్నిక (పదవ సారి)




    Sunday, June 7, 2015

    DSC Telugu Civics Study



     



    DSC Study Material telugu literature material for civils  civils telugu literature books  civils telugu literature previous papers  civils telugu compulsory paper  civils telugu syllabus telugu literature material for civils  civils telugu literature books  civils telugu literature previous papers  civils telugu compulsory paper  civils telugu syllabus telugu literature material for civils  DSC civils telugu literature books  civils telugu literature previous papers   DSC civils telugu compulsory paper  civils telugu syllabus